• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

న్యాయవాద రక్షణ చట్టం అమలుకై పాదయాత్ర

RR: న్యాయవాద రక్షణ చట్టం అమలు కోసం ఆలంపూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాదయాత్ర కొనసాగుతుంది. పాదయాత్రకు చేవెళ్ల బార్ అసోసియేషన్ సభ్యులు సంఘీభావం తెలిపారు. వారు మాట్లాడుతూ.. న్యాయవాదులు సమాజంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలియజేయాలనే దృఢ సంకల్పంతో న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

February 25, 2026 / 03:09 PM IST

మాడుగులపల్లి PS పరిధిలో “అరైవ్ అలైవ్”

NLG: మాడుగులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో “అరైవ్ అలైవ్” కార్యక్రమం భాగంగా డ్రైవర్ల కోసం ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయబడింది. దూరం, సమీప, కలర్ విజన్, కంటి ఒత్తిడి పరీక్షలు నిర్వహించి, నైట్ విజన్ సమస్యలపై సూచనలు చేశారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ..“డ్రైవర్‌కు కంటి చూపు స్పష్టంగా ఉండకపోతే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయన్నారు.

February 25, 2026 / 03:05 PM IST

మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన సర్పంచ్

NZB: విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని వండి పెట్టాలని వర్ని మండలం పైడిమల్ సర్పంచ్ అనూష చిరంజీవి సూచించారు. బుధవారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను ఆమె తనిఖీ చేశారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ప్రభుత్వ మెనూ ప్రకారం రోజువారీగా విద్యార్థులకు మంచి భోజనాన్ని అందించాలని సూచించారు.

February 25, 2026 / 03:05 PM IST

నూతన పాలకవర్గంతో అమ్మవార్లను దర్శించుకున్న MLA

BDK: ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య బుధవారం మేడారం సమ్మక్క సారలమ్మల ను దర్శించుకున్నారు. ఇటీవల జరిగిన ఇల్లందు మున్సిపాలిటీ ఎన్నికలలో గెలుపొందిన ఛైర్మన్, వైస్ ఛైర్మన్, లతోపాటు కౌన్సిలర్లు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమ్మక్క సారలమ్మల దయతో రాష్ట్రం సభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరినట్లు తెలిపారు.

February 25, 2026 / 03:05 PM IST

ముగ్గురు విద్యార్థులు గైర్హాజరు

KMR: ఎల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తెలుగు, హిందీ, ఉర్దూ సబ్జెక్టులకు సంబంధించి అధికారులు ‘సెట్-బీ’ ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేశారు. మొత్తం 246 మంది విద్యార్థులకు గాను 243 మంది హాజరు కాగా, ముగ్గురు గైర్హాజరయ్యారని అధికారులు వెల్లడించారు.

February 25, 2026 / 03:01 PM IST

‘మాదకద్రవ్యాలతో కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలి’

SRCL: జిల్లాలో డ్రగ్స్, మాదకద్రవ్యాలతో కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో మాదకద్రవ్యాల, డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టిన చర్యలపై అదనపు ఎస్పీ చంద్రయ్యతో కలిసి సంబంధిత అధికారులతో జిల్లాస్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశాన్ని జిల్లా కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు.

February 25, 2026 / 03:00 PM IST

‘జయంతికి రావాలని ఎంపీకి ఆహ్వానం’

ADB: ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నగేశ్‌ను ప్రధాన్ పురోహిత్ జిల్లా సంఘం నాయకులు పట్టణంలోని ఎంపీ నివాసంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మార్చి 15న రామ్ లీలా మైదానంలో నిర్వహించనున్న హీరా సుఖ జయంతి కార్యక్రమం గోడ ప్రతులను ఎంపీ నగేశ్‌తో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమానికి రావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు.

February 25, 2026 / 03:00 PM IST

ప్రభుత్వ డిగ్రీ కళాశాల బలోపేతానికి అధిక నిధులు: MLA

MHBD: ప్రభుత్వ డిగ్రీ కళాశాల బలోపేతానికి అధిక నిధులు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. తొర్రూరు డిగ్రీ కళాశాలలో మార్చి 13వ తేదీన జరిగే జాతీయ సెమినార్‌కు హాజరుకావాలని ఎమ్మెల్యేకు కళాశాల ప్రిన్సిపల్ ఆహ్వానం అందజేశారు. అనంతరం అడ్మిషన్ కరపత్రాలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.

February 25, 2026 / 02:59 PM IST

పరీక్షా కేంద్రాన్ని పరిషలించిన ఆర్డీవో

MDK: టేక్మాల్ గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆర్డీవో రమాదేవి మండల అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాలలోని వసతులను కళాశాల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని వారికి సూచించారు. వీరిలో తహశీల్దార్ తులసిరామ్, కళాశాల సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

February 25, 2026 / 02:59 PM IST

మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదకరం: సీఐ

MBNR: మద్యం సేవించి వాహనాలు నడిపితే జీవితాలు రోడ్డుపాలవుతాయని మహబూబ్‌నగర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేందర్ రెడ్డి అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి సీఐ బుధవారం పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల డ్రైవర్ నిర్ణయ సామర్థ్యం తగ్గి ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు.

February 25, 2026 / 02:56 PM IST

కౌడిపల్లిలో యాక్సిడెంట్..!

MDK: కౌడిపల్లి నుంచి మెదక్ వెళ్తున్న ద్విచక్ర వాహనానికి లోతు వాగు వద్ద కుక్క అడ్డురావడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వాహనం అదుపుతప్పి కిందపడటంతో దేవులపల్లి గ్రామానికి చెందిన వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించారు. బాధితుడిని చికిత్స నిమిత్తం మెదక్ ఆసుపత్రికి తరలించారు.

February 25, 2026 / 02:49 PM IST

పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

NLG: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని ఇవాళ కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ సందర్శించారు. పరీక్షకు హాజరైన విద్యార్థుల సంఖ్య, అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రశ్న పత్రాలు, జవాబు పత్రాలను భద్రత గురించి అడిగి తెలుసుకున్నారు. కాపీ కి అవకాశం లేకుండా చూడాలని కలెక్టర్ సిబ్బందికి సూచించారు.

February 25, 2026 / 02:46 PM IST

బాధితుడికి సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేసిన సర్పంచ్

MHBD: నెల్లికుదురు మండలంలోని సౌల్ల తండా గ్రామ పంచాయతీకి చెందిన భూక్యా సోమ్లాకు వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కును స్థానిక ఎమ్మెల్యే మురళి నాయక్ ఆదేశాల మేరకు ఇవాళ సర్పంచ్ గుగులోత్ సుజాత వాసు చేతుల మీదుగా బాధితుడికి అందజేశారు. సీఎంఆర్ఎఫ్ పథకం ప్రతి పేద వారికి ఒక వరం అని, దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

February 25, 2026 / 02:45 PM IST

అసంపూర్తిగా దర్శనమిస్తున్న మరుగుదొడ్లు

BHPL: కాటారం మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణ పనులు రెండేళ్లు గడుస్తున్నా పూర్తికాకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ప్రతాపగిరి పాఠశాలలో బాలుర మరుగుదొడ్ల పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో విద్యార్థులు బహిర్భూమికి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లా అధికారుల స్పందించాలన్నారు.

February 25, 2026 / 02:44 PM IST

కంగ్టి ఎంపీడీవోకు ప్రమోషన్… సీఈఓ అభినందన

SRD: కంగ్టి మండల అభివృద్ధి అధికారి సత్తయ్యకు పదోన్నతి లభించింది. గత రెండేళ్ల నుంచి ఇక్కడ పనిచేస్తున్న ఈయనకు డిప్యూటీ సీఈఓగా ప్రమోషన్ కల్పిస్తూ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఇవాళ సంగారెడ్డిలో సీఈవో జానకి రెడ్డితో ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈయనకు పదోన్నతికి CEO అభినందనలతో శుభాకాంక్షలు తెలిపారు.

February 25, 2026 / 02:42 PM IST