తెలంగాణ లో గ్రూప్-4 దరఖాస్తుల గడువు ముగిసింది. రికార్డు స్థాయిలో 9,51,321 దరఖాస్తులు వచ్చాయి. గ్రూప్-4 ఉద్యోగాల భర్తీ కింద 8,180 పోస్టులకు టీఎస్పీఎస్సీ దరఖాస్తులను నిర్వహించింది. వాస్తవానికి జనవరి 30వ తేదీతో గ్రూప్-4 దరఖాస్తులకు గడువు ముగిసింది. ఆ రోజు వరకు 8,47,277 దరఖాస్తులు వచ్చాయి. జనవరి 29న 49 వేలు, 30వ తేదీన 34,247 దరఖాస్తులు వచ్చినట్లు టీఎస్పీఎస్సీ అధికారుల...
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఈ నెల 5న సమావేశం జరుగనుంది. ప్రగతి భవన్ లో ఉదయం 10:30 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన భేటీ కానుంది. పిబ్రవరి 6న శాసన సభలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్ కు కేబినెట్ ఈ సమావేశంలో ఆమోదం తెలపనుంది. కేబినెట్ భేటి అనంతరం సీఎం కేసీఆర్ మహారాష్ట్రలోని నాందేడ్ కు బయల్దేరి వెళ్లనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి స్పెషల్ ఫ్లైట్ లో ఆయన నాందేడ్ కు వెళ్లనున్నారు. గురుద్వారా లో కేసీఆర...
తెలంగాణలో ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్(Congress) కంచుకోటగా ఉన్న ములుగు నియోజకవర్గం(mulugu constituency)పై అధికార బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ చేసింది. ప్రస్తుత ఎమ్మెల్యే దాసరి అనసూయ(dansari anasuya).. అలియాస్ సీతక్క(seethakka)పై పోటీ చేసేందుకు BRS తరఫున బడే నాగజ్యోతిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంల...
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 12 వరుకు కొనసాగనున్నాయి. బీఏసీ సమావేశంలో శాసన సభ సమావేశల తేదీలను ఖరారు చేశారు. గవర్నర్ ప్రసంగం పై రేపు ధన్యవాద తీర్మానం ప్రవేశపెడతారు. ఈ నెల 6న రాష్ట్ర బడ్జెట్ 2023-24 ఉంటుంది. ఈనెల 7న అసెంబ్లీ కి సెలవు. జనవరి 8 నుండి 12 వరుకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయి. పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది’ అని కాళోజీ చెప్పిన మాటలను గుర్తు […]
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ దర్మించుకున్నారు. గురువారం కొండపై చేరుకున్న గవర్నర్ కు కలెక్టర్ పమేలా సత్పతి ,ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆలయం వద్ద ఆమెకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. నేరుగా స్వయంభు ఆలయంలోకి వెళ్లిన గవర్నర్ లక్ష్మి నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పండితులు గవర్నర్కు ఆశీర్వచనం చేశారు. అధ...
అసెంబ్లీ గన్ పార్క్ వద్ద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హల్ చల్ చేశారు. అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్లనివ్వరా…మొన్న సెక్రటరీయెట్ వేళ్తే అడ్డుకున్నారంటూ నిరసనకు దిగారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ గుండాయిజం ఎంటి అని ప్రశ్నించారు. అంబేడ్కర్ సెక్రటేరియట్ని కేసీఆర్ పుట్టినరోజు ఓపెన్ చేయడం ఎంటి..? వాస్తు బాగాలేదని సెక్రటేరియట్ కులగొట్టడం ఎంటి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను వద్దన్నాను, దేవు...
తెలంగాణ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా అరుదైన దృశ్యం కనిపించింది. రాజకీయపరంగా బద్ధ శత్రువులుగా ఉంటున్న వారు కలిసి మాట్లాడుకున్నారు. సరదాగా మాట్లాడుతూ నవ్వులు పంచుకున్నారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పరస్పరం మాట్లాడుకున్నారు. ఇటీవల హుజురాబాద్ లో తాను పర్యటిస్తే ఎందుకు పాల్గొనలేదని కేటీఆర్ ఈటలను ప్రశ్నించారు.. దీనికి ఈటల సరదాగా సమాధానం ఇవ్వడంతో నవ్వులు విరబూశాయి. గ...
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్స్టాపబుల్ ఎపిసోడ్ రికార్డులు బద్దలు కొట్టింది. బాలకృష్ణ హోస్ట్గా ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో వస్తున్న ఈ టాక్ షో పలు గత రికార్డులను పవర్ స్టార్ షో దాటేసింది. ఈ ఎపిసోడ్ ఏకంగా 100 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్ను ఆహాలో క్రాస్ చేసిందట. ప్రభాస్ ఎపిసోడ్ రికార్డును బ్రేక్ చేసి, ఫాస్టెస్ట్గా నిలిచింది. వెండితెర మీద మాత్రమే కాకుండా ఓటీటీలోను పవన్ కళ్యాణ్ రికార్డుల...
మూడేండ్ల తర్వాత గవర్నర్ ప్రసంగంతో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం ప్రసంగం చేశారు. దేశానికి తెలంగాణ పాలన ఆదర్శంగా నిలుస్తోందని ప్రసంగంలో గవర్నర్ తెలిపారు. అనేక మలుపులు తిరిగిన తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రశాంతంగా మొదలుకావడం విశేషం. అయితే గవర్నర్ ప్రసంగాన్ని ప్రతిపక్షాలు తప్పుబట్టాయి. ప్రభుత్వం అనేక తప్పులను గవర్నర్ ప్రసంగం ద్వారా...
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఎన్నో మలుపులు తిరిగిన బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రశాంతంగా మొదలయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించారు. ప్రజాకవి, స్వాత్రంత్య సమరయోధుడు కాళోజీ నారాయణ రావు చెప్పిన ‘పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది’ అనే పంక్తులను ఉటంకిస్తూ గవర్నర్ ప్రసంగం చేశారు. తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని ప్రసంగంలో గవర్నర్ ప...
హైదరాబాద్ నడిబొడ్డున అమెరికాలోని వైట్ హౌస్ మాదిరి నిర్మాణమవుతున్న తెలంగాణ రాష్ట్ర కొత్త సచివాలయంలో మంటలు వ్యాపించడంపై రాజకీయ వివాదం చెలరేగింది. ఈ సంఘటన చెలరేగడం దురదృష్టకరమని ప్రతిపక్ష పార్టీలు తెలిపాయి. ఈ ఘటనపై వెంటనే విచారణ చేసి వాస్తవాలు ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తీరుపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. స...
కళాతపస్వి కే విశ్వనాథ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. ఆయన మృతి ఎంతో బాధాకరం అన్నారు. సృజనాత్మక బహుముఖ దర్శకుడిగా తనని తాను ప్రత్యేకం చేసుకున్న సినీ ప్రపంచంలోని ప్రముఖుడు అని కొనియాడారు. ఆయన సినిమాలు ప్రేక్షకులను ఎంతో అలరించాయి… ఆకర్షించాయన్నారు. కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కే విశ్వనాథ్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు...
ప్రముఖ దర్శకుడు, కళా తపస్వి, పద్మశ్రీ కె.విశ్వనాథ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం తెలిపారు. అతి సామాన్యమైన కథనైనా తమ అద్భుత ప్రతిభతో వెండి తెర దృశ్య కావ్యంగా మలిచే అరుదైన దర్శకులు విశ్వనాథ్ అని సీఎం కొనియాడారు. భారతీయ సామాజిక విలువలకు, సంస్కృతీ సంప్రదాయాలకు తమ సినిమాలో విశ్వనాథ్ పెద్ద పీట వేశారని గుర్తు చేసుకున్నారు. విశ్వనాథ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి సీఎం కేసీఆర్...
తనకు తన తండ్రి హెచ్డీ దేవేగౌడ తర్వాత తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాజకీయంగా ఎంతో స్ఫూర్తి అని కర్నాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి అన్నారు. రాయచూరులో నిర్వహించిన పంచరత్న రథయాత్రలో ఆయన మాట్లాడారు. నీటి పారుదల ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల అమలులో దేవేగౌడ, తర్వాత కేసీఆర్ అద్భుతమన్నారు. తెలంగాణలో కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా ఎన్నో జిల్లాలకు నిరంతరం నీరు అందిస్తున్న కేసీఆర్ త...
కళాతపస్వి కే విశ్వనాథ్ మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనకు పితృ సమానులని, అలాంటి వ్యక్తి ఇక లేరని తెలిసి నమ్మలేకపోతున్నట్లు చెప్పారు. ఆయన గొప్పతనం గురించి మాటలు చాలవని, పండితులను, పామరులను కూడా ఒకేలా మురిపించే ఆయన సినిమాల శైలి ఎంతో విశిష్టమైనదన్నారు. ఆయనలా సున్నితమైన ఆర్ట్ ఫిలిమ్స్ను కూడా బ్లాక్ బస్టర్ హిట్స్గా మలిచిన దర్శకులు మరొకరు లేరన్నారు. తెలుగు సినిమా ఖ్యాతిన...