తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలతోపాటు వారిపై జరుగుతున్న అఘాయిత్యాలు, హత్యలను నిరసిస్తూ దీక్ష చేయడం అభినందనీయం. మహిళా సమస్యలపై పోరాడుతున్న తీరు భేష్. తెలంగాణ మహిళలకు బీజేపీ జాతీయ నాయకత్వం అండగా ఉందనే భరోసా ఇవ్వాలి.
మహిళా రిజర్వేషన్ల బిల్లు (Women's Reservation Bill) కోసం ఢిల్లీ (New Delhi)లో కవిత దీక్ష చేస్తుండగా ఆమెకు పోటీగా హైదరాబాద్ (Hyderabad)లో బీజేపీ ‘మహిళ గోస- బీజేపీ భరోసా దీక్ష’ అనే కార్యక్రమం చేపట్టింది. హఠాత్తుగా ఈ దీక్ష పెట్టడానికి కారణం కవిత దీక్షను దారి మళ్లించేందుకు, హైప్ తగ్గించేందుకు చేసినట్లు తెలుస్తోంది.
Naveen:బీటెక్ స్టూడెంట్ నవీన్ (Naveen) హత్య కేసు సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తోంది. పోలీసుల విచారణలో రోజుకో విషయం వెలుగుచూస్తోంది. నిహారిక (niharika) ఈ రోజు పలు కీలక అంశాలను తెలిపింది. హరి హర (hari hara) తాను లవ్ (love)లో ఉన్నామని చెబుతూనే.. నవీన్ (Naveen) హత్య గురించి ప్రస్తావించింది.
మీకు విశ్వసనీయత, నిజాయితీ ఉంటే తాను బీజేపీలో చేరినందుకు 18వేల కోట్ల కాంట్రాక్టు పొందానని చేసిన ఆరోపణలను నిరూపించాలని బీజేపీ(BJP) నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal reddy) మంత్రి కేటీఆర్(KTR)కు సవాల్ విసిరారు. తనపై తప్పుడు ప్రచారం చేసి మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) పార్టీ గెలిచిందని పేర్కొన్నారు.
అభివృద్ధి పనుల కోసం ప్రజలు కొన్ని రోజులు సహకరించాలని విన్నవించారు. మళ్లింపుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లితే ప్రయోజనంగా ఉంటుందని చెప్పారు. స్థానికులు సహకరించాలని కోరారు.
భారత రాష్ట్ర సమితి నాయకురాలు (Bharata Rashtra Samithi - BRS), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC kavitha) కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు (Congress Party) సోనియా గాంధీ (Sonia Gandhi) పైన ప్రశంసలు కురిపించడంతో పాటు, ఆ పార్టీని తన నిరసన దీక్షకు ఆహ్వానించారు.
వైయస్ వివేకానంద (YS Vivekananda Reddy) కూతురు సునీత (Suneetha Narreddy) కూడా తెలంగాణ హైకోర్టు మెట్లు ఎక్కారు. అవినాష్ పిటిషన్ పైన విచారణలో తనను ఇంప్లీడ్ చేయాలని (implied petition) ఆమె కోరుతున్నారు.
BRS BJP Competitive initiations:మహిళా రిజర్వేషన్ల కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, భారత్ జాగృతి ఫౌండర్ కల్వకుంట్ల కవిత (kavitha) కదం తొక్కారు. ఢిల్లీ నడిబొడ్డున జంతర్ మంతర్ (jantar mantar) వద్ద దీక్షకు దిగారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు మొదలైన దీక్ష సాయంత్రం 4 గంటలకు ముగియనుంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఆమె కోరుతున్నారు.
తన జన్మదినం సందర్భంగా సీఎం కేసీఆర్ (KCR) అట్టహాసంగా సచివాలయ ప్రారంభోత్సవం నిర్వహించాలని భావించారు. దీనికోసం సచివాలయ పనులు ఆగమేఘాల మీద జరుగుతున్నాయి. అకస్మాత్తుగా రాష్ట్రంలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు రావడంతో ప్రారంభోత్సవం వాయిదా వేయలేక తప్పలేదు.
తాము చేసిన ఈ ఆరోపణలను నిరూపించేందుకు సిద్ధం’ అని రాజీనామా చేసిన నాయకులు తెలిపారు. ఈ పరిణామంతో వనపర్తి టీఆర్ఎస్ లో కలకలం ఏర్పడింది. ఒక్కసారిగా పార్టీ రెండుగా చీలిపోయింది. అయితే వీరి రాజీనామా వ్యవహారంపై మంత్రి నిరంజన్ రెడ్డి ఇంకా స్పందించలేదు.
తెలంగాణ(telangana) ఎమ్మెల్సీ కవిత(kavitha)ను ఈడీ(ED) అధికారులు అరెస్ట్ అయితే కేసీఆర్(kcr) రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని పలు వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ క్రమంలో నేడు తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో భాగంగా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా(amit shah) కూడా తన హైదరాబాద్ పర్యటనను మార్చి 12న రావాల్సి ఉండగా...
దేశరాజధాని ఢిల్లీ(delhi)లోని జంతర్మంతర్(jantar mantar) వద్ద తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(mlc kavitha) నిరసన(protest) దీక్ష చేయనున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు(Womens Reservation Bill) డిమాండ్ చేస్తూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్ర 4 వరకు దీక్ష కొనసాగించనున్నారు. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీల వారు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
భాగ్యనగరంలో(hyderabad) ఉల్లిపాయల(onion) ధర(rate) భారీగా తగ్గింది. క్వింటాల్ ఉల్లి ధర హోల్సేల్ మార్కెట్లో(wholesale market) రూ.1,200 నుంచి రూ.2000 వరకు అమ్ముతున్నారు. దీంతో కిలో ఉల్లిని రూ.12 నుంచి రూ.21 వరకు ఆన్ లైన్లో(online)విక్రయిస్తుండగా, రిటైల్, కిరాణా షాపుల్లో(retail price) ఉల్లి పరిమాణం, నాణ్యతను బట్టి కిలో రూ.16 నుంచి రూ.25 వరకు సేల్ చేస్తున్నారు.
కట్నం అడిగిన అమ్మాయిని పలువురు మహిళా సంఘాల ప్రతినిధులు అభినందిస్తున్నారు. కాగా ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘అబ్బాయిలు జాగ్రత్త’,‘ఇక మన పని అయిపోయింది’ అని కొందరు కామెంట్లు చేస్తుండగా.. ‘నిద్ర లేచింది మహిళా లోకం’ అంటూ పాటలు పాడుతున్నారు.