• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

టీచర్ల దంపతుల కేటగిరి బదిలీలకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో నేటి నుంచి టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. టీచర్ల దంపతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. టీచర్ల దంపతుల బదిలీలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. టీచర్ల దంపతుల కేటగిరి బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దంపతులను ఒకే చోటుకు బదిలీ చేయాలని నిర్ణయించింది. గతంలో నిలిపి వేసిన 12 జిల్లాల్లో దంపతుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సూర్యా...

January 27, 2023 / 07:18 AM IST

సెక్యులరిజం పేరుతో హిందూమతంపై దాడి వద్దు: పవన్ కళ్యాణ్

సెక్యులరిజం పేరు మీద సనాతన ధర్మం మీద దాడి చేయడాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. ఈ మధ్య హిందూ దేవతల పైన మాట్లాడటం చూస్తూనే ఉన్నామని, ఇది అత్యంత దారుణమని అభిప్రాయ పడ్డారు. ఇటీవల అయ్యప్ప స్వామిని, ఆ తర్వాత సరస్వతి మాతను దూషించిన అంశాలు చూశామని గుర్తు చేశారు. అలా దూషించే అందరికీ నేను చేతులు జోడించు చెబుతున్నానని, అలాంటి దూషణ కేవలం బ్రాహ్మణులే బాధపడతారు అనుకుంటే పొరపాటు అన్నారు. ప్...

January 27, 2023 / 07:01 AM IST

కీరవాణి, చంద్రబోస్‌ను సత్కరించిన గవర్నర్ తమిళి సై

గణతంత్ర దినోత్సవ వేడుకలు ఈ రోజు తెలంగాణ రాజ్‌భవన్‌లో ఘనంగా జరిగాయి. గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత పలువురు ప్రముఖులను సత్కరించారు. ఆర్ఆర్ఆర్ మూవీలో నాటు నాటు పాట ఆస్కార్‌కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సంగీత దర్శకుడు కీరవాణి పద్మశ్రీ అవార్డు వరించింది. ఎంఎం కీరవాణి, ఆ పాట రాసిన గీత రచయిత చంద్రబోస్‌ను గవర్నర్ సన్మానించారు. శాలువా కప్పి, మెమెంటో...

January 26, 2023 / 08:46 PM IST

బీబీసీ డాక్యుమెంటరీపై రచ్చ.. హెచ్ సీయూలో ఉద్రిక్తత

గుజరాత్ అల్లర్లపై ప్రఖ్యాత వార్తా సంస్థ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ (India: The Modi Question) హైదరాబాద్ లో వివాదం రేపింది. భారతదేశంలో బీబీసీ డాక్యుమెంటరీ వీక్షించడంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఆ డాక్యుమెంటరీని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్ సీయూ)లో ప్రదర్శించారని సమాచారం. ఈ ప్రదర్శనను వ్యతిరేకిస్తూ ఏబీవీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. దీంతో వర్సిటీలో...

January 26, 2023 / 08:23 PM IST

‘గణతంత్రం’ రోజే విషాదం.. ఆఫీస్ లోనే అధికారి ఆత్మహత్య

దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. గణతంత్ర వేడుకలు అట్టహాసంగా నిర్వహించాల్సిన అధికారి కార్యాలయంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. అయితే వ్యక్తిగత కారణాలతో బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తున్నది. జీవితంపైనే విరక్తితో అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు రాసుకున్న లేఖలో ఆయన తెలిపాడు. అనారోగ్య సమస్యలు భరించలేక అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్...

January 26, 2023 / 06:30 PM IST

తెలంగాణ సర్కార్ రాజ్యాంగాన్ని అవమానించింది: గవర్నర్

తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ మరోసారి విమర్శలు చేశారు. రాజ్యాంగాన్ని తెలంగాణ సర్కార్ అవమానించిందని పేర్కొన్నారు. తమిళి సై సౌందరరాజన్ పుదుచ్చేరిలో మీడియాతో మాట్లాడారు. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ చేరుకుంటారు. రాత్రి 7 గంటలకు రాజ్ భవన్‌లో ఎట్ హోం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి కూడా సీఎం కేసీఆర్, మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరు కావడం లేదని విశ్వసనీయ సమాచారం. ‘ప్రజల మధ్య గణతంత్ర వ...

January 26, 2023 / 06:21 PM IST

శ్రావణి వెనక బీజేపీ.. ఫేస్‌బుక్ లైవ్ ఎందుకు ఇచ్చింది: సంజయ్

‘సంజయ్ దొర మీకు దండాలు, మున్సిపల్ చైర్మన్ పదవీకి రాజీనామా చేస్తున్నా’ అని నిన్న జగిత్యాల మున్సిపల్ చైర్మన్ బోగ శ్రావణి మీడియా ముందుకు వచ్చారు. శ్రావణి ఆరోపణలపై అధికార పార్టీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పందించారు. శ్రావణి వెనక బీజేపీ నేతలు ఉన్నారని తిప్పికొట్టారు. ఈ విషయం కౌన్సిలర్లే తనకు ఫిర్యాదు చేశారని వివరించారు. ఆమె రాజీనామా చేయగా బీజేపీ ఫేస్‌బుక్ లైవ్ ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. ఆమెను తాను వే...

January 26, 2023 / 06:08 PM IST

రెండ్రోజుల్లో పెళ్లి.. పందిట్లో విషాదం నింపిన వరుడు

పెళ్లికి సమయం ముంచుకొస్తుంది. ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి.. పనులు వేగవంతం చేయాలని వరుడు కూడా ఓ చేయి వేశాడు. కుటుంబసభ్యులతో పాటు అతడు పనులు చేస్తున్నాడు. ఎన్నో ఆశలతో వివాహ బంధంలోకి అడుగుపెడుతున్న ఆ యువకుడు కొద్దిసేపటికే కుటుంబాన్ని మొత్తం కన్నీటిలో ముంచి వెళ్లిపోయాడు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కన్నుమూశాడు. ఆనందాలు సంతోషాలతో నిండాల్సిన ఆ ఇంట్లో గుండెశోకం మిగిలింది. ఈ సంఘటన తెలంగాణలోని ఆదిలాబ...

January 26, 2023 / 04:30 PM IST

‘ఎట్ హోం’కు కేసీఆర్ డుమ్మా? హస్తినకు గవర్నర్ తమిళి సై

ఎట్ హోం కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరు కావడం లేదని తెలుస్తోంది. రిపబ్లిక్ డే రోజున సాయంత్రం గవర్నర్ ఎట్ హోం నిర్వహిస్తుంటారు. ఇటీవల సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ మధ్య దూరం మరింత పెరిగింది. అధికార కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. రిపబ్లిక్ డే వేడుకలు కూడా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేయడంతో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది. కోర్టు తీర్పు తర్వాత రాజ్ భవన్‌లోనే పరేడ్ నిర్వహణకు ఏర...

January 26, 2023 / 03:59 PM IST

కేసీఆర్ మీ పనైపోయింది.. రిటైర్మెంట్ తీస్కో: విజయశాంతి

గణతంత్ర దినోత్సవ కార్యక్రమం కూడా తెలంగాణలో రాజకీయంగా మారింది. గవర్నర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై అధికార పక్షంపై తీవ్రంగా స్పందించగా.. గణతంత్ర వేడుకలు రాజ్ భవన్ కే పరిమితం చేయడంపై బీజేపీ, కాంగ్రెస్ లు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తాజాగా ఇదే విషయమై సినీ నటి, బీజేపీ నాయకురాలు విజయశాంతి స్పందించారు. కేసీఆర్ వెంటనే వీఆర్ఎస్ తీసుకోవాలని సూచించారు. తెలంగాణలో వచ్చేది తమ ప్రభుత్వమేనని ధ...

January 26, 2023 / 03:51 PM IST

థ్యాంక్యూ గవర్నర్.. మా మాటే మీ నోట: కల్వకుంట్ల కవిత

దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ప్రశాంతంగా సాగుతుండగా తెలంగాణలో మాత్రం వాడీవేడిగా జరిగాయి. మరోసారి రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య గణతంత్ర వేడుకలు వివాదానికి కారణమయ్యాయి. రాజ్ భవన్ లో జెండా వందనం అనంతరం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఫామ్ హౌజ్ పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు, ప్రజాప్రతినిధులు తీవ్రంగా ఖండిస్తున్నారు. రాజ్...

January 26, 2023 / 04:34 PM IST

గవర్నర్ కు సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలి: రేవంత్

గణతంత్ర వేడుకల వేదికను రాజకీయం చేయవద్దని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన గాంధీ భవన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడారు. గవర్నర్ తమిలసాయి, ముఖ్యమంత్రి కేసిఆర్ మధ్య విభేదాలు ఉంటే మరో వేదిక చూసుకోవాలని సూచించారు. గణతంత్ర దినోత్సవం రాద్ధాంతం సరికాదని, ప్రభుత్వం వెంటనే గవర్నర్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్...

January 26, 2023 / 02:11 PM IST

‘పద్మశ్రీ’పై కీరవాణి ట్వీట్

ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి వరుసగా అవార్డులు అందుకుంటూ చరిత్రను తిరగరాస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకుని తెలుగు పాట ఖ్యాతిని పెంచారు. ఇప్పుడు ఆస్కార్ నామినేషన్ల లిస్టులో నాటు నాటు పాట చేరడంతో మరో ఘనత సాధించారు. తాజాగా నేడు ఆయన పద్మశ్రీ  పురస్కారాన్ని అందుకున్నారు. Much honoured by the civilian award from the Govt of India 🙏 Respect for my...

January 26, 2023 / 01:33 PM IST

తెలుగు వారికి పద్మ అవార్డులు, కేంద్రంపై బాబు ప్రశంస

తెలుగువారికి పద్మ అవార్డుల పైన టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. పద్మ అవార్డులు సాధించిన వారికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలుగువారి కృషిని కేంద్ర ప్రభుత్వం గుర్తించడం ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు. పద్మ అవార్డులు సాధించిన తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని, ఎందరో తెలుగువారి అద్భుతమైన కృషిని గుర్తించడం తనకు చాలా సంతోషాన్ని కల...

January 26, 2023 / 11:14 AM IST

రాజ్‌భవన్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు

హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎస్ శాంతి కుమారి హాజరయ్యారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ రచనలో అంబేద్కర్ ఎంతో అంకితభావం కనబరిచారని అన్నారు. ఆ రాజ్యాంగం ప్రకారంగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని తెలిపారు. శతాబ్దాల చరిత్ర ఉన్న హైద...

January 26, 2023 / 02:05 PM IST