NZB: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని పెర్కిట్ బైపాస్ రోడ్డులో నూతనంగా నిర్మించిన రూపాంతర చర్చిలో జరిగిన వేడుకల్లో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో పాల్గొని క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత దేశం సర్వ మతాల సమ్మేళనమని అన్నారు.