KMM: ఆర్యవైశ్య కార్పొరేషన్కు నిధులు కేటాయించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకి మధిర మండల ఆర్యవైశ్య సంఘం విజ్ఞప్తి చేసింది. శుక్రవారం జిల్లా ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షుడు వనమా వేణుగోపాలరావు (సూరి) నివాసంలో ఏర్పాటు చేసిన బ్రేక్ ఫాస్ట్ మీటింగ్కు భట్టి హాజరయ్యారు. ఆర్యవైశ్యుల అభివృద్ధి, సంక్షేమానికి కార్పొరేషన్కు నిధులు అత్యవసరం అన్నారు.