NZB: నవీపేట్ మండలం జన్నేపల్లిలో ఎల్లమ్మ ఆలయంలో బాపిరాజు దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే ప్రతి కుటుంబంలో దైవచింతన ఉండాలన్నారు. ప్రతి సంవత్సరం నవరాత్రి పర్వదినాల్లో దేశంలోనే శక్తి పీఠాలను సందర్శిస్తామని అన్నారు. దసరా రోజు బాసర సరస్వతిని దర్శించుకున్నామన్నారు. బాపిరాజు దంపతులను మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఘనంగా సన్మానించారు.