MNCL: బెల్లంపల్లి జాతీయ రహదారి బైపాస్ జంక్షన్ వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైపాస్ మూలమలుపు వద్ద రెండు కార్లు ఢీ కొన్నట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో హనుమాన్ బస్తీకి చెందిన తిరుపతి అక్కడిక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న అతడి భార్య, కూతురు, మనవడికి తీవ్రగాయాలైనట్లు వెల్లడించారు. వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.