ADB: ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీ సోయం బాపురావును జిల్లా కాంగ్రెస్ నాయకులు బుధవారం పట్టణంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించి, పుష్పగుచ్చం అందజేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపునకు అనుసరించాల్సిన వ్యూహాలు, తదితరాంశాలపై వారితో చర్చించారు.