నంద్యాల: ఈనెల 14న జరిగే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మాడుగులపల్లి ఎస్సై ఎస్. కృష్ణయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ లోక్ అదాలత్ ద్వారా పెండింగ్లో ఉన్న కేసులు ఇరువర్గాలు రాజీ చేసుకునే అవకాశం ఉందన్నారు. రాజీ మార్గమే రాజమార్గం అని పేర్కొన్నారు. ఇతర విషయాల గురించి ఏమైనా సందేహం ఉంటే మండల స్టేషన్ను సంప్రదించాలన్నారు.