BHNG: చేనేత సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా ఉద్యమించాలని చేనేత జన సమాఖ్య జాతీయ అధ్యక్షుడు మాచర్ల మోహన్ రావు పిలుపునిచ్చారు. భూదాన్ పోచంపల్లిలో జిల్లా చేనేత జన సమాఖ్య ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులు, చేనేత సంస్థల ప్రతినిధులతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.