MHBD: గంగారం మండల కేంద్రంలో రేపు (ఆదివారం) ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల స్థాయి విస్తృత సమావేశం నిర్వహించబడనుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అరణ్య, పర్యావరణ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క హాజరుకానున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు.