NZB: జిల్లా కమ్మర్ పల్లి రైతు వేదికలో ఇవాళ ఉదయం 10 గంటలకు ఆయిల్ పామ్ సాగుపై అవగాహన సదస్సు జరుగుతుందని ఎంఏవో రమ్యశ్రీ తెలిపారు. నిపుణులు సాగు పద్ధతులు, సబ్సిడీలు, ఎరువుల యాజమాన్యం మరియు అంతర పంటల ద్వారా ఆదాయంపై రైతులకు అవగాహన కల్పిస్తారు. ఆసక్తి గల రైతులు ఈ సదస్సుకు హాజరై అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.