ADB: పశువుల సంరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సామూహిక ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని చేపట్టిందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక లో భాగంగా మంగళవారం తలమడుగు పశువైద్యశాలలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పశువులకు టీకాలు వేసే ప్రక్రియను స్వయంగా పరిశీలించారు.