NGKL: పీఎం జన్మన్ పథకంలో భాగంగా మన్ననూర్ వైద్య బృందం బుధవారం కొల్లంపెంట, కొమ్మనపెంట చెంచు పెంటల్లో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించింది. సుమారు 45 మంది చెంచులకు షుగర్, బీపీ, మలేరియా, డెంగ్యూ పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. గర్భిణులు, బాలింతలకు హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారి మోహన్ లాల్ తెలిపారు.