ADB: జైనథ్ మండలంలోని ఆకుర్ల గ్రామంలో శ్రీ బాజీరావు మహారాజ్ శోభాయాత్ర కార్యక్రమాన్ని ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. అనంతరం భక్తులతో కలిసి గ్రామంలో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. బాజీరావు మహారాజ్ ప్రవచించిన ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలని MLA పాయల్ శంకర్ పేర్కొన్నారు.