WNP: శ్రీరంగాపూర్ లోని అంబేడ్కర్ కాలనీలో ఇండ్ల మధ్యలో ఏపుగా పెరిగిన కంప చెట్లతో కాలనీ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ఆశన్న ఎమ్మెల్యే మేఘా రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే మండల వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీహరి రాజును ఆదేశించగా జేసీబీ సాయంతో ఇండ్ల మధ్య కంపచెట్లను తొలగించారు. కాలనీ వాసులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.