NZB: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి వివిధ రూపాల్లో చిన్నారులు ఆకట్టుకున్నారు. NZB జిల్లా కేంద్రంలోని గోనెరెడ్డి సంఘం ఆధ్వర్యంలో హనుమాన్ మందిరంలో నెలకొల్పిన దుర్గామాత మందిరం వద్ద అమ్మవారి వివిధ అలంకరణల్లో చిన్నారులు అలరించారు. బుధవారం సాయంత్రం మండపం వద్ద హోమం, కుంకుమార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వాములు అంతిరెడ్డి విజయపాల్ రెడ్డి ఉన్నారు.