PDPL: రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు మంథని మండలం ఎక్లాస్ పూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని నారమళ్ళ రజిత ఎంపికయ్యారు. ఈ నెల 10 నుంచి హన్మకొండలో జరుగనున్న రాష్ట్ర స్థాయి 69వ ఎస్జీఎఫ్ బాక్సింగ్ పోటీలలో పాల్గొంటారు. 48 కేజీల విభాగంలో రజిత ఉమ్మడి కరీంనగర్ జిల్లా పోటీలలో బంగారు బహుమతి సాధించి రాష్ట్రస్థాయి పోటీలలో ఎంపికైనట్లు హెచ్ఎం తెలిపారు.