GDWL: రాబోయే గణేష్ ఉత్సవాలు, మిలాద్-ఉన్-నబి పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలని అయిజ ఎస్సై శ్రీనివాసరావు కోరారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని అయిజ పోలీస్ స్టేషన్లో శానివరం ఆయన ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని మతాల పెద్దలను ఆహ్వానించి.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పండుగలను సంతోషంగా నిర్వహించుకోవాలని ఆయన సూచించారు.