SRD: సిగాచి పరిశ్రమ ప్రమాదం జరిగి 80 రోజులు అవుతున్న ఇప్పటివరకు పరిహారం ఇవ్వకపోవడం సరికాదని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు మాణిక్యం అన్నారు. పటాన్చెరులో గురువారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. నెల రోజుల్లో కోటి రూపాయల పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ఎందుకు అమలు కాలేదని ప్రశ్నించారు.