NRML: నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈ నెల 15,16 తేదీలలో నిర్వహించే గ్రూప్-2 పరీక్షకు 24 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అదనపు కలెక్టర్ పైజాన్ అహ్మద్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో చీఫ్ సూపరిండెంట్లు, అబ్సర్వర్లు, లోకల్ రూట్ ఆఫీసర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. గ్రూప్-2 పరీక్షకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు.