WGL: వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామంలోని ఎక్లేసియా పెంతుకోస్తు ప్రార్థన మందిరంలో పాస్టర్ సుమన్ ఆధ్వర్యంలో పాస్టర్స్ డే వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పాస్టర్ సుమన్ దేవుని చిత్తమును నెరవేర్చడానికి దైవజనులు ఎంపికవుతారని పేర్కొన్నారు. యేసు బోధనలు ప్రజలను సన్మార్గంలో నడిపిస్తాయని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో సంఘపెద్దలు, తదితరులు పాల్గొన్నారు.