KMM: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో బుధవారం మిర్చి, పత్తి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి. క్వింటా కొత్త మిర్చి ధర రూ.14,100, క్వింటా పత్తి ధర రూ.6,850 జెండా పాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే కొత్త మిర్చి ధర రూ.100 పెరగగా.. అటు పత్తి ధర రూ.50 తగ్గినట్లు వ్యాపారులు చెప్పారు. మార్కెట్లో నియమ నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు.