MNCL: ఈ నెల 27 నుండి జరగనున్న సీఎం కప్- 2024 తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన జిల్లా క్రీడాకారులు 26న ఉదయం 9 గంటలకు మంచిర్యాలలోని జడ్పీ బాలుర పాఠశాల మైదానంలో రిపోర్ట్ చేయాలని డీవైఎస్ఓ కీర్తి రాజవీరు తెలిపారు. జూడో, కబడ్డీ, వాలీబాల్, కిక్ బాక్సింగ్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, తదితర క్రీడాంశాలలో ఎంపికైన వారు హాజరు కావాలని సూచించారు.