NRPT: పెరిగిన అధునాతన టెక్నాలజీ వాడుతూ సైబర్ నేరగాళ్లు ప్రజలను ఆర్థికంగా దోచుకుంటున్నారని వారి ఉచ్చులో పడి ప్రజలు మోస పోవద్దని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ బుధవారం అన్నారు. లోన్ యాప్ ద్వారా రుణాలు తీసుకోవద్దని, ఫోన్లకు వచ్చే అనవసరపు లింకులు తెరవకూడదని సూచించారు. అపరిచితులకు బ్యాంకు ఖాతా, ఓటీపీ, క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలు ఇవ్వకూడదన్నారు.