MNCL: అభివృద్ధిలో భాగంగా చేపట్టిన నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం కోటపల్లి KGBVలో కొనసాగుతున్న అదనపు తరగతి గదులు, భోజనశాల, వంటశాలల నిర్మాణ పనులు, మధ్యాహ్న భోజన పథకం అమలును అధికారులతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు.