ఖమ్మం: సినీ నటుడు మంచు మోహన్ బాబు మీడియాపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో స్వేచ్చా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం నిరసన తెలిపారు. స్థానిక రిపోర్టర్ తంబళ్ల రవి మాట్లాడుతూ.. మీడియాపై దాడి చేసిన మోహన్ బాబుపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అలాగే జర్నలిస్ట్ లకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.