MNCL: పంట పొలాల్లో ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ వద్ద రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలని తాండూర్ మండల విద్యుత్ AE జాన్ ప్రకటనలో సూచించారు. ఇటీవల ట్రాన్స్ ఫార్మర్లోని విలువైన రాగి తీగ, అల్యుమినియం దొంగలించే ముఠాలు ఎక్కువయ్యాయన్నారు. పలుచోట్ల చోరీలకు పాల్పడ్డాయన్నారు. ట్రాన్స్ఫార్మర్ వద్ద గస్తీ కాయడం, CC కెమెరాల ఏర్పాట్లు లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.