SRPT: బీసీలను మోసం చేసేందుకే 42% రిజర్వేషన్లు కల్పిస్తామని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం డ్రామా ఆడిందని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఉడుం కృష్ణ ఆరోపించారు. గురువారం రాత్రి ఆయన ఒక పత్రిక ప్రకటనలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 22 నెలలైనా, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు.