MBNR: పొన్నాకల్ స్టేజ్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సందర్శించారు. బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో మృతి చెందిన రవి, నాగన్న కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాతీయ రహదారిపై రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు.