WGL: నెక్కొండ మండల కేంద్రంలోని అప్పలరావుపేట రోడ్డులో శనివారం లారీ అదుపుతప్పి బోల్తా పడింది. లారీ వేగంగా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మూల మలుపు వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులు లేకపోవడం వల్ల తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు.