HYD: భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి జయంతి సందర్భంగా హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని కేంద్రమంత్రులు, కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాజ్యసభ సభ్యులు కే. లక్ష్మణ్తో కలిసి ప్రారంభించారు. శిబిరంలో బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు.