BDK: ఇల్లందులోని విట్టల్ రావు భవన్లో కామ్రేడ్ ఏపూరి బ్రహ్మం పార్థివ దేహానికి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి మృతి ప్రజా, రైతు ఉద్యమాలకు తీరని లోటన్నారు. బ్రహ్మం ఆశయాల సాధనకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం అంతిమ యాత్రలో పాల్గొన్నారు.