నాగర్ కర్నూల్ పట్టణంలోని గాంధీ పార్క్ వద్ద మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సత్యం, అహింస, సమానత్వం కోసం గాంధీ చేసిన పోరాటాన్ని స్మరించుకుంటూ, ప్రతి ఒక్కరూ ఆయన సిద్ధాంతాలను ఆదరించాలని పిలుపునిచ్చారు.