KMR: కంటి సమస్యలపై నిర్లక్ష్యం వహించకూడదని ఆప్తాల్మిక్ ఆఫీసర్ హరికిషన్ తెలిపారు. నేడు పిట్లంలోని CHCలో కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 62 మందికి కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఏడుగురికి సర్జరీ కొరకు లైన్స్ ఐ హాస్పిటల్ బాన్సువాడకు రిఫర్ చేయడం జరిగిందన్నారు. 15 మందికి అద్దాలు వాడాలని సూచించినట్లు పేర్కొన్నారు.