NZB: ఆమ్ ఆద్మీ పార్టీ పట్టణ మైనారిటీ అధ్యక్షుడు షేక్ వసీం 20 వార్డు ఇన్ఛార్జ్ షేక్ అమెర్ల ఆధ్వర్యంలో బుధవారం ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజుకు మెమోరాండం అందజేశారు. వార్డ్ నెం. 20 లోని మసీదు దగ్గర డ్రైనేజీలను శుభ్రం చేయాలని, అవాంఛిత చెట్లను కత్తిరించడానికి జవాన్లను పంపమని కోరారు. పట్టణంలో డెంగ్యూ , మలేరియా వంటి వ్యాధులతో ప్రజలు బాధపడుతున్నారు.