WNP: ఆత్మకూరులో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అమరచింత సీపీఎం నాయకులను పోలీసులు ఇవాళ ఉదయం ముందస్తు అరెస్ట్ చేశారు. సీపీఎం, సీఐటీయూ నేతలు జీ.ఎస్.గోపి, ఆర్యన్ రమేష్, ఏజీకేఎస్ జిల్లా అధ్యక్షుడు అజయ్లను పోలీస్ స్టేషన్కు తరలించారు. సమస్యలు చెప్పే స్వేచ్ఛ కూడా లేదా అని నేతలు ప్రశ్నించారు.