MNCL: మంచిర్యాల జిల్లా నీటి పారుదల శాఖ కార్యాలయంలో మంగళవారం టీఎన్జీవోస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఉద్యోగులకు టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి సభ్యత్వ నమోదు పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు శివప్రసాద్, పట్టణ అధ్యక్షులు నాగుల గోపాల్, నాయకులు రోశయ్య, సంపత్, అరుణ, తదితరులు పాల్గొన్నారు.