GDWL: కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందించాలని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి ఆన్లైన్ క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. 2025 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు నమోదైన నేరాలపై సమీక్షించారు. నేర పరిస్థితులు, కేసుల విచారణ, పురోగతి, శాంతిభద్రతలు, సైబర్ నేరాలు, మాతా శిశు నేరాలపై సమీక్షించారు.