HYD: బోయిన్ పల్లి సీవీఆర్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు బుధవారం నిర్వహించారు. ఈ క్రిస్మస్ వేడుకల్లో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు బోధనలు ఎంతో గొప్పవని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత కార్పొరేటర్ తిరుపతి యాదవ్, మాజీ ఎంపీపీ శేఖర్ యాదవ్, ఆరెపల్లి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.