JGL: భీమారం మండలంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి సిద్ధిధాత్రి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ రూపంలో అమ్మవారు భక్తులకు అష్టసిద్ధులను ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు. అర్చకులు, భవాని దీక్షాపరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.