ఖమ్మం: ప్రజా సమస్యలపై బయ్యారం మండల సీపీఎం పార్టీ నాయకులు సర్వే నిర్వహించారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఒకటో వార్డు నుండి ప్రజా సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఆ పార్టీ నాయకులు మండా రాజన్న తెలిపారు. ఈ సర్వేలో అర్హులైన వారికి ఇండ్ల నిర్మాణం, పింఛన్, డ్రైనేజీ, రోడ్ల నిర్మాణం, విద్యుత్తు దీపాల వంటి సమస్యలను గుర్తించామన్నారు.