NZB: సదాశివ్ నగర్ చట్టాలపై మహిళలు అవగాహన కలిగి ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి నాగరాణి అన్నారు. అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో చట్టాలపై మహిళలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. గృహహింస, బాల్యవివాహాల నిర్మూలన చట్టాలపైన అవగాహన కల్పించారు. ప్రతినిధులు షేక్ అలీమ్, అబ్దుల్ లతీఫ్, ఐకెపి ఎపిఎం రాజిరెడ్డి, విజయ్ కుమార్ పాల్గొన్నారు.