WNP: ఆత్మకూరు మున్సిపాలిటీ కేంద్రంలో నూతనంగా నిర్మించిన అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈనెల 14న అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఉంటుందని అయ్యప్ప సేవా సమితి సభ్యులు తెలిపారు. ఈ మేరకు ఆత్మకూరు పట్టణంలో విగ్రహ ప్రతిష్ఠాపనకు సంబంధించిన కరపత్రాలను సేవా సమితి సభ్యులు విడుదల చేశారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.