HYD: వాజ్ పేయి జీవితం అందరికీ ఆదర్శమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. బుధవారం ఖైరతాబాద్లో పార్టీ నేత మానేకర్ చంద్రు బాబా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాజ్ పేయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. వాజ్ పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వాజ్ పేయి నవయుగ హృదయ సామ్రాట్గా పేరు తెచ్చుకున్నారని చెప్పారు.