HYD: ప్రజలు సమస్యలను చెప్పుకునేందుకు MIM పార్టీ కార్యాలయానికి ఎప్పుడైనా రావచ్చని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. బుధవారం వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని కలిసి వారి సమస్యలను చెప్పుకున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేలు పార్టీ కార్యాలయంలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు.