MBNR: జిల్లా కేంద్రంలోని అయ్యప్ప కొండపై బుధవారం జరిగిన పడిపూజ వేడుకల్లో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం దేవాలయ 27వ వార్షికోత్సవం విశేషాలను తెలుసుకున్నారు. అయ్యప్ప స్వాములు ఆశీర్వాదం తీసుకుని వారిని పవిత్ర శబరిమలకు పంపుతూ వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సమితి సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.