SRCL: ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను ఎటువంటి జాప్యం లేకుండా పరిష్కరించాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులకు బదిలీ చేసి పరిష్కరించాలని ఆదేశించామన్నారు.