ELR: నూజివీడు పట్టణంలోని ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థి ఎంటెక్ సివిల్ ఇంఛార్జ్ ప్రొఫెసర్ గోపాల రాజుపై కత్తితో సోమవారం దాడి చేసిన సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. హాజరు సరిగా లేని ఓ విద్యార్థిని లేబరేటరీ టెస్టుకు అనుమతించకపోవడంతో కత్తితో దాడి చేసినట్లు బాధితుడు గోపాలరాజు ఆవేదన వ్యక్తం చేశారు. నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో గోపాలరాజు చికిత్స పొందుతున్నారు.